పవన్ కళ్యాణ్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు – మంత్రి మేరుగు

-

అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మంత్రి మెరుగు నాగార్జున. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్రని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

బిజెపి నేతలు.. టిడిపి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని.. ఏపీలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని బిజెపి నేతలకు సలహా ఇచ్చారు. ఏపీలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని నమ్మి, ఆ దిశగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టిడిపి, బిజెపి, జనసేన ను ప్రజలు నమ్మరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news