లోకేష్ చేస్తోంది యువగళం కాదు.. ఒంటరిగళం – మంత్రి రోజా

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. లోకేష్ చేస్తుంది యువగలం కాదని.. ఒంటరి గళం అని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రికార్డు లోకేష్ దని అన్నారు. లోకేష్ అంకుల్ అంటూ ప్రారంభించి.. రాష్ట్రానికి ఏమి చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారని విమర్శించారు. నందమూరి కుటుంబాన్ని అవసరాలకు వాడుకొని, అధికారం రాగానే విస్మరిస్తున్నారని ఆరోపించారు.

తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా దోచుకొని హైదరాబాదులో దాచుకోవడమే కాకుండా తన తండ్రిని మళ్లీ సీఎం పీఠం ఎక్కించేందుకు లోకేష్ అంకుల్ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా లోకేష్ పాదయాత్రలో ఉండరని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని ఎంత వేధించిన జగన్ ఆత్మస్థైర్యంతో పాదయాత్ర చేసి పేదల కష్టాలను వింటూ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news