స్థాయిని దిగజార్చుకోవద్దు.. డిఎల్ రవీంద్ర పై మండిపడ్డ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

-

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పై మరోసారి మండిపడ్డారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి. డి.ఎల్ రవీంద్రారెడ్డి ఒక స్థలం విషయంలో ఆయిల్ మిల్ యజమాని రామాంజనేయులు రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తే నేను కూడా ప్రమాణానికి సిద్ధమేనని సవాల్ విసిరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వయిరీ జరుగుతుందని.. త్వరలోనే నిందితుల వివరాలు వస్తాయన్నారు.

సొంత చిన్నాయనను చంపింది ఎవరో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుని నామరూపాలు లేకుండా చేస్తానన్నారని.. నేడు వైయస్సార్ పార్టీని భూస్థాపితం చేస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరితరం కాదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదన్నారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.

డిఎల్ రవీందర్ రెడ్డి సొంత పంచాయతీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా కూడా ఆయన మనిషి గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. దమ్ము ధైర్యం ఉంటే రామాంజనేయులు రెడ్డి డబ్బు ఇవ్వలేదని ప్రమాణం చేస్తేనేను కూడా ప్రమాణానికి సిద్ధం అన్నారు. నేను డబ్బులు తీసుకున్నానని సుబ్బారెడ్డి తో గాని ఎస్ఎల్వి వారితో గాని చెప్పిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news