సీఎం జగన్ కి షాకిచ్చిన రఘురామకృష్ణంరాజు.. కేంద్రానికి లేఖ..!

-

ఏపీ సర్కారు విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని, వాటిని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాశారు. తొట్లకొండ బౌద్ధారామం ఉన్న కాపులుప్పాడలో వీఐపీ అతిధి గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారని అన్నారు. తొట్లకొండను 1978లో చారిత్రక ప్రదేశంగా ప్రకటించారని, బఫర్‌ జోన్‌కు 300మీ. దూరంలో రక్షితప్రాంతంగా గుర్తించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు.

కాబట్టి ఈ చారిత్రక ప్రదేశంలో నిర్మాణాలు వెంటనే ఆపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే గతంలో కూడా తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు రఘురామకృష్ణంరాజు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవలంటూ ఆయన సీఎం జగన్ కి కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news