ఏపీలో కరోనా టెర్రర్.. మరో ఎంపీకి కరోనా పాజిటివ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

అంతేగాకుండా శుక్రవారం వరకూ అమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నది. దీంతో ఆమె పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం మొదలైంది. అయితే గత కొన్ని రోకులుగా తనను కలిసిన వాళ్ళని, తనతో పాటు కార్యక్రమాలలో పాల్గొన్నవారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆమె కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news