షేమ్.. షేమ్.. బాబూ: కరోనా గ్యాప్ ఓవర్… సాయిరెడ్డి ఈజ్ బ్యాక్!

-

చంద్రబాబు పేరు చెబితే ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యే సాయిరెడ్డి… కరోనా పాజిటివ్ రావడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. పదిరోజులు తనవైపు నుంచి బాబుని ప్రశాంతంగా వదిలేశారు. అయితే తాజాగా “సాయిరెడ్డి ఈస్ బ్యాక్” అన్న రేంజ్ లో మళ్లీ మొదలెట్టేశారు ఈ వైకాపా రాజ్యసభ సభ్యుడు. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత మళ్లీ మొదలెట్టేశారు!

తాజాగా చంద్రబాబు… పోలవరం నుంచి మొదలుపెడితే ఏపీలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని.. మొదలుపెట్టామని.. ప్లాన్ చేశామని.. 13జిల్లాలను ఎలా అభివృద్ది చేయతలచామనే విషయాలను బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయాలపై ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించారు సాయిరెడ్డి.

“సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్లకోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్” అంటూ బాబు గంటలపాటు చెప్పిన ఉపన్యాశానికి ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు!

ఇదే సమయంలో… “బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట! 175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు… 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట!! షేమ్.. షేమ్.. బాబూ…!” అంటూ మరో ట్వీట్ చేశారు సాయిరెడ్డి! దీంతో… సాయిరెడ్డి ట్విట్టర్ వార్ స్టార్ చేసినట్లేననే కామెంట్లు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news