వచ్చే ఐదు ఏళ్ళు రాష్ట్రంలో బ్లాక్ డేనే..!

-

చంద్రబాబు నైజం మరోసారి బయట పడింది. కౌంటింగ్ జఠిగిన మధ్యానం నుండి చంద్రబాబు ఆయన గుండాలు వరుసగా దాడులు,చేయటం మొదలు పెట్టారు అని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయడం, మహిళల పై దాడులు, అరాచకాలు చేస్తున్నారు. ఇవన్నీ పక్కదారి పట్టించేందుకు అంబేద్కర్ విగ్రహం పై దాడులకు ప్రయత్నం చేస్తున్నారు అని నందిగం సురేష్ పేర్కొన్నారు.

విజయవాడలో జగన్ అంబెడ్కర్ విగ్రహం పెట్టిన నాటి నుండి టీడీపీ నేతలు అక్కసు కక్కుతూనే ఉన్నారు. అప్పుడు బడాయి హామీలు ఇచ్చి నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. కానీ అనవసర హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయను అని జగన్ ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ ని కించపరిచే విదంగా జరుగుతున్న ప్రయత్నాలు అడ్డుకుంటాం. నిన్న రాత్రి నుండి వచ్చే ఐదు ఏళ్ళు రాష్ట్రంలో బ్లాక్ డేనే. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తాం.. అవసరం అయితే న్యాయస్థానంని కూడా ఆశ్రయిస్తాం అని నందిగం సురేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news