ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 44వ రోజు అన్నమయ్య జిల్లా మదయ్య గారి పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి యువతతో నారా లోకేష్ ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర యువత ఎక్కువగా నష్టపోయిందని అన్నారు.

టిడిపి హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న రాష్ట్రం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత ఎక్కువగా నష్టపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట సీఎం జగన్ యువతను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news