విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాధేయడం దారుణం: నారా లోకేష్

-

రెండు నెలలు కూడా కాకముందే డిజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచడం సామాన్యుడిపై పెనుబారం మోపడమే అని అన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణమన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్టీసీ రూపు రేఖల్ని మారుస్తాం అన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టాడన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదని లోకేష్ దుయ్యబట్టారు. రెండో విడత బాదుడే బాదుడు లో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ. 500 కోట్లు పేదల నుంచి వైసీపీ ప్రభుత్వం కొట్టేస్తుందన్నారు.పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ప్రెస్ లో రూ. 90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ. 120, ఏసీ సర్వీసులో రూ. 140 పెంచారని నారా లోకేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news