ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది – నారా లోకేష్‌

-

జగన్‌ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని ఆగ్రహించారు నారా లోకేష్‌. డిజిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని, క్రైమ్ రేట్ పెర‌గ‌లేద‌ని నిన్న‌నే క‌దా మీకు మీరు స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్నారని…. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన మీ వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి టెన్త్ క్లాస్ అబ్బాయి అమ‌ర్ నాథ్‌ని అత్యంత దారుణంగా కొట్టి త‌గ‌ల‌బెట్ట‌డం నేరం కాదా సార్‌ అంటూ నిప్పులు చెరిగారు.

త‌న అక్క‌ని వేధిస్తున్న వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిని నిల‌దీయ‌డ‌మేనా బీసీ బాలుడు అమ‌ర్ నాథ్ చేసిన పాపం…. ద‌య‌చేసి వైసీపీ బుద్ధితో కాకుండా ఐపీఎస్ బుద్ధితో చూడండని కోరారు. ఇన్ని దారుణాలు పాత బీహార్‌లోనూ జ‌రిగి ఉండ‌వని తెలిపారు. సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితుడు కృష్ణ‌య్య హ‌త్య‌, సీఎం జిల్లాలో ద‌ళిత మ‌హిళ నాగ‌మ్మ‌పై హ‌త్యాచారం, సీఎం ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్‌, నెల్లూరు లో పట్టపగలే యువతి పై రేప్, ఎంపీ కుటుంబ‌స‌భ్యుల కిడ్నాప్ ఈ దారుణ‌మైన నేరాలు-ఘోరాలు మీ కంటికి వైసీపీ పాల‌న‌లో చేప‌డుతున్న స్వ‌చ్ఛంద‌సేవా కార్య‌క్ర‌మాల్లా క‌నిపించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల దౌర్భాగ్యం. జగన్ పాలనలో ఏపి క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news