జనమంతా కలిసి..జగన్ ను సాగనంపాల్సిందే – నారా లోకేష్

-

 

జనమంతా కలిసి..జగన్ ను సాగనంపాల్సిందేనని టిడిపి సీనియర్ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్.

వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిందని విమర్శలు చేశారు.

తమను రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షలకు మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే వేటు వేస్తున్నారు జగన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. పదేళ్లలోపు సర్వీసు వున్నవారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ రెడ్డీ నిన్ను ఎందుకు నమ్మాలయ్యా జనం అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news