YSR ను వెన్నపోటు పొడిచింది జగన్ రెడ్డినే – నారా లోకేష్

-

YSR ను వెన్నపోటు పొడిచింది జగన్ రెడ్డినే అంటూ సంచలన ట్వీట్‌ చేశారు నారా లోకేష్. ఎన్టీఆర్‌ పేరు మార్చడంపై వైసీపీ నేతల ట్వీట్లకు కౌంటర్‌ గా.. నారా లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి అని ఆరోపణలు చేశారు.

మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదని.. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నానంటూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడిన వీడియోను షేర్‌ చేసి మరీ… నారా లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అని మండిపడ్డారు.

తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news