అమ్మ ఒడి ఊసే లేదు.. ఏ ముఖం పెట్టుకొని జగన్‌ ఓట్లు అడుగుతారు? : లోకేశ్

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడారు.

‘‘వంద సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన దేశంలోనే ఏకైక వ్యక్తి జగన్‌. బీసీ సోదరుల వెన్నెముక విరగొట్టారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోతపెట్టారు. కోత పెట్టిన రిజర్వేషన్లను తిరిగి తీసుకువస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్‌ ద్వారా రుణాలిప్పిస్తాం. బీసీలపై 26వేల దొంగ కేసులు పెట్టారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎందరు పిల్లులుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రస్తుతం అమ్మ ఒడి, జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. మహిళలను ఏ ముఖం పెట్టుకొని సీఎం జగన్‌ ఓట్లు అడుగుతారు? విద్యుత్‌, గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెంచారు. ’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news