రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా మాజీ మంత్రి నారాయణ..పాదాయాత్ర చేస్తామని ప్రకటన

-

రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా మాజీ మంత్రి నారాయణ పాల్గొంటున్నారు. అంతేకాదు.. టిడిపిదే విజయమని ప్రకటించారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు లో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ…మాట్లాడుతూ, నెల్లూరు సిటీ..రూరల్ నియోజకవర్గంలో పాదయాత్రకు రూపకల్పన చేస్తున్నామని కీలక ప్రకటన చేశారు.

టిడిపి హయాంలో నెల్లూరు నగర అభివృద్ధికి వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. 70 శాతం పనులుపూర్తి చేశాం..మిగిలిన పనులు చేయలేక పోయారని.. టిడిపి ప్రభుత్వం లో విమర్శల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news