తెలంగాణలో విషాదం..స్కూల్‌ బస్సు ఢీ కొట్టి 5 ఏళ్ల చిన్నారి మృతి

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు ఢీ కొట్టి 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో స్కూల్ బస్సు ఢీ కొని 5 ఏళ్ల భావన మృతి చెందింది. బాలాపూర్ కు చెందినా సిస్టర్ నివేదిత కు చెందిన స్కూల్ బస్సు రాజీవ్ గృహ కల్పన విద్యార్థులను దించి వెళుతుండగా కాలనీకి చెందిన భావనను ఢీ కొట్టింది.

దీంతో ఆ చిన్నారి అక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కాలనీకి చెందిన వారూ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఆదిభట్ల పొలీసులు. చిన్నారి బావన మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇబ్రహీం పట్నం మార్చురీకి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పీడ్ గా వెళ్తున్నాడని..అందుకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news