ఏపీలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం.. పవన్ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో వాలంటీర్ వ్యవస్థతో మానవ అక్రమ రవాణా జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో విడత వారాహి విజయ యాత్రను పవన్ ఆదివారం రోజున ఏలూరులో ప్రారంభించారు. పెదపాడు మండలం వట్లూరులోని క్రాంతి కల్యాణమండపం నుంచి జిల్లాకేంద్రం ఏలూరు పాతబస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ కూడలి వరకు యాత్ర చేశారు. రాత్రి అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు.

వైఎస్సార్సీపీ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారని చెప్పారు. ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు గతేడాది ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాగ్‌ నివేదికలో అక్రమాలన్నీ బయటపడ్డాయని.. కాగ్‌ అడిగిన ప్రశ్నలకు జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news