బర్త్‌ డే వేడుకల్లో విషాదం : ముగ్గురు మృతి.. పవన్ దిగ్భ్రాంతి..!

-

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడకల్లో భాగంగా గతరాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం చోటుచేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమనులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 25 అడుగుల ఎత్తున బ్యానర్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. కాగా, ఈ విషాద ఘటనపై అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం అని అన్నారు.

ఈ ఘటన తన మనసుని బాగా కలచి వేసింది అని అన్నారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటా అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకి సూచించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపోతే మరణించిన వారి లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం ఆ ప్రాంతం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news