చంద్రబాబు మెప్పుకోసమే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు – పేర్ని నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మెప్పుకోసమే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఏకవచనంతో పిలిస్తే తాము అలాగే సమాధానం ఇస్తామని అన్నారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసమే పవన్ కళ్యాణ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని అన్నారు.

ఆధారాలు లేకుండా విషపు లెక్కలు చెబుతున్నారని.. పవన్ లో మంచితనం ఉంటే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. 30 వేల మంది ఒంటరి మహిళలు అదృశ్యమయ్యారని, ఈ లెక్కలు ఎన్సీబీ, పవన్ కళ్యాణ్ నుండి వచ్చిందని చెప్పారు. జగన్ పై ఎన్నో తప్పుడు కేసులు పెట్టినా ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. పేద, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేస్తున్న వాలంటీర్ల పట్ల పవన్ కళ్యాణ్ దిగజారి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news