పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మరు – బొత్స

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓ సినీ నటుడు కాబట్టే ప్రజలు చూడడానికి వస్తున్నారని అన్నారు. ఇక జనసేన పార్టీని తాను ఓ రాజకీయ పార్టీగా భావించడం లేదన్నారు. తనని చూడడానికి వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చింది మాట్లాడితే ప్రజలు నమ్మరు అన్నారు బొత్స. జగనన్న కాలనీల అభివృద్ధి కోసం ఖర్చు చేసిందే 3,000 కోట్లు అయితే.. 15 వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా? అని నిలదీశారు. “విజయనగరం పర్యటనలో ఒక్కరైనా కంప్లైంట్ చేశారా? గాలి కబుర్లు చెబుతూ ఇష్టరాజ్యంగా మాట్లాడతారా” అని ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news