వైసీపీ ప్రభుత్వంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసు – ఎంపీ లక్ష్మణ్

-

కర్నూల్: కేంద్రప్రభుత్వం ప్రగతి నివేదిక నిజాయితీగా, నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. మోదీ కంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం చేసినట్లు నిరూపిస్తారా..? అని ప్రశ్నించారు. దళారి వ్యవస్థ లేకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసని అన్నారు లక్ష్మణ్.

ప్రపంచమంతా ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే ముందు చూపుతో మోదీ అభివృద్ధి పైనే పెట్టుబడులు పెట్టారని అన్నారు. అగ్రదేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని.. భారత్ జిడిపి 7.2 ఉందన్నారు. పొరుగు దేశాలలో ఆహార కొరత ఉందని.. భవిష్యత్తులో ప్రపంచం లో అతి పెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలుస్తుందన్నారు. ప్రపంచంలో భారత్ విశ్వగురు గా ఎదిగే స్థాయికి చేరిందన్నారు. తెలంగాణలో ఎకరాకు 8 వేలు బిఆర్ఎస్ ప్రజా ధనాన్ని పంపిణీ చేస్తుందని.. సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వకుండా వ్యాపారులకు, ధనవంతులకు కూడా ఇస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news