ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలె – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. “అమరవీరుల త్యాగం – కల్వకుంట్ల వారి భోగం” అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట! దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట అని విమర్శించారు. ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట! అంటూ దుయ్యబట్టారు షర్మిల. ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే అంటూ తీవ్రవిమర్శలు చేశారు.

“1200 మంది అమరుల త్యాగాలపై రాజ భోగాలు అనుభవిస్తూ..రాష్ట్ర సంపదను పందికొక్కుల లెక్క దోచుకుతింటూ.. ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను..సకల జనులను అవమానించడమే మీ సంస్కారమా? చావు నోట్లో తలకాయ పెట్టి, బయటకు వచ్చింది ఎందరో అయితే.. చావును ముద్దాడి రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించింది మరెందరో..దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలు ఆడితేనో తెలంగాణ రాలే! మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ.

సకల జనులు వారి జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ.ఉద్యమ నినాదంతో సీఎం పీఠం ఎక్కి..అమరవీరుల అడ్రస్సులు,త్యాగధనుల పేర్లు నామరూపాలు లేకుండా చేసి తమతోనే రాష్ట్రం వచ్చిందని.. పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నారు అయ్యా, కొడుకులు. తెలంగాణ చరిత్రను,త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. స్వరాష్ట్రంలో అమరులకు గుర్తింపు లేదు,వస్తాయనుకున్న ఉద్యోగాలు రాలే.ఉద్యోగులకు జీతాలు లేవు, కార్మికులకు హక్కులు లేవు.

ప్రశ్నించే హక్కును రద్దు చేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ… “బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుత” అంటే కానీ బ్రతకలేని పరిస్థితి. ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టి..తెలంగాణ పదాన్ని పార్టీ నుంచే తుడిపేసి..జై తెలంగాణ అంటే.. నై తెలంగాణ అని చెప్తున్న పెద్ద తెలంగాణ ద్రోహి కేసీఆర్. ఇక తనది పార్టీ కాదని మిషన్ అని చెప్తున్న దొర..మీది పార్టీ అని ఎవరన్నారు? బందిపోట్ల రాష్ట్ర సమితికి “దోపిడీ మిషన్”.రాష్ట్రాన్ని దోచుకో-దాచుకో ఇదే మీ మిషన్” అని మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news