అమరావతి పునర్నిర్మాణం.. నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టినా ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పున:ప్రారంభానికి సిద్ధం అయింది. ఆ పనులకు నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.

ఇవాళ ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ. ఆ తరువాత ఆ పనులు నిలిచిపోయాయి. ఈనెల 16న జరిగిన సీఆర్ఢీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభం పై నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా నేడు పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు.. అప్పటికే పూర్తయిన భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం విధితమే. మరోవైపు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version