“వ్యూహం”లో చంద్రబాబు క్యారెక్టర్ ను అరటి పండు వలిచినట్లు వలిచి పెడతాను – RGV

-

ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ అన్నారు. కన్నార్పని మూడో జీవి చంద్రబాబు అని.. వ్యూహం సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ ను అరటి పండు వలిచినట్లు వలిచి పెడతానని ఫైర్‌ అయ్యారు. నేను ఇక్కడకు మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి వచ్చాను… రాజమండ్రిలో ఈ జోక్ జరుగుతోందని టీడీపీకి చురకలు అంటించారు రామ్‌గోపాల్‌ వర్మ.

స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి అని.. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా?? అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారని ఆగ్రహించారు. రజనీకాంత్ చంద్రబాబు పక్కన కూర్చుని ఎన్టీఆర్‌ను ఇవాళ పొగడటం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమేనని.. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news