కొత్త పార్లమెంట్‌.. ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం-ప్రధాని మోడీ

-

కొత్త పార్లమెంట్‌.. ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాసేపటి క్రితమే.. ప్రధాని మోడీ చేతుల మీదులో పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది.. 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని వెల్లడించారు.

ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్‌ అద్దం పడుతుంది.. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నాం.. ఇది కేవలం భవనం మాత్రమే కాదు.. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించాం.. భారత్‌ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news