BREAKING : విజయవాడ దుర్గ గుడిలో చోరీ.. దీని వెనుక హస్తం ఎవరిది..?

-

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. అమ్మవారి ఉత్సవాల్లో వినియోగించే నాలుగు వెండి రథం సింహాలలో మూడుమాయమైనట్లు తెలుస్తుంది. ఒక్కో సింహ విగ్రహం తయారీకి 8 కేజీల వెండి ఉపయోగించారు. మైయమైన వస్తువుల విలువ 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు..

ఈ చోరీ వెనుక హస్తం ఎవరిది? ఎవరిని రక్షించడానికి దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు? 3 సింహాల మాయం దుర్ఘటనపై నిజానిజాలు వెంటనే బైటపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలోనే కృష్ణా జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్దమైన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపింది.

Read more RELATED
Recommended to you

Latest news