వ్యవసాయం దండగా అని చంద్రబాబు రాయలేదా ? : మంత్రి రోజా

-

తిరుపతిలో రైతు భరోసా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, ఎంపీలు రెడ్డప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారని వెల్లడించారు. 14 సం’ అధికారంలో 13 సం’ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా.. అని ఆగ్రహించారు.

రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా…? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారని ఫైర్‌ అయ్యారు. వ్యవసాయం దండగా అని పుస్తకం రాసిందా చంద్రబాబు కాదా..? అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో రైతులు కష్టానికి విలువ లేదు..‌రైతుల చెమటకి ఖరీదు లేదు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఎంతో మంది వేదికలపైకి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులను చూశాం..కానీ’ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం కమిట్మెంట్ తో రైతులకు ఆదుకోవాలని ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినేనని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news