ఏపీలో రౌడీయిజం చేస్తామంటే.. కత్తిరిస్తాం – మంత్రి రోజా

-

ఏపీలో రౌడీయిజం చేస్తామంటే.. కత్తిరిస్తామని టీడీపీకి వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ మంత్రి రోజా. అనంతపురంలో పిస్తా హౌస్ బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రి రోజా అనంతరం మాట్లాడారు. రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొదని చంద్రబాబు ప్రయత్నం చేశారని.. రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు.

చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ రివర్స్ అవుతున్నాయని.. చంద్రబాబు హయాంలో తన బినామీలకు రాజధానిలో భూములు కేటాయిస్తే….సీఎం జగన్ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనుకున్నారని వెల్లడించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు బంధు ప్రభుత్వం అయిన మాపై విమర్శలు చేయడం విడ్డూరం అని.. అధికారంలోకి వస్తే….ఎవర్నీ వదిలి పెట్టము అంటున్న చంద్రబాబు…. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం అన్న సంగతి మర్చిపోతున్నారని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news