మంత్రిగా రోజా బాధ్యతలు..ముద్దుల్లో ముంచేసిన కుటుంబ సభ్యులు

-

కాసేపటి క్రితమే ఏపీ పర్కాటన శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో… గుమ్మడికాయతో ఆమెకు దిష్టి తీసిన రోజా భర్త సెల్వమణి. మంత్రి ఛాంబర్లో తన ఛైరులో కూర్చొన్న తర్వాత తల్లికి రోజా కూతురు, కొడుకు ముద్దులు పెట్టారు. అనంతరం ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా రోజాకు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా.. టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ… పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అడుగు జాడల్లో నడిచానని.. మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ సైనికుల్లా పని చేశామన్నారు. మంత్రి వర్గంలో ఈక్వేషన్లను బేస్ చేసుకుని కేటాయింపులు చేశారని… జగన్ లాంటి నేతతో కలిసి నడవడం మా అదృష్టం అన్నారు.

జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని.. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ నమ్ముకాన్ని వమ్ము చేయనని.. రాష్ట్రంలో ఉన్మ వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామని.. దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో నిర్మిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news