హిందూ సమాజాన్ని అవమానపరిచినట్లే..జగన్ కు లేఖ రాసిన ఎంపీ !

-

ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇంతకు ముందే ఏపీలో వినాయక చవితి వేడులకి అనుమతి ఇవ్వాలని లేఖ రాసిన ఆయన ఇప్పుడు ఆ అనుమతులు ఇవ్వకపోవడంతో లేఖ రాశారు. వినాయకచవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందనిఆయన అన్నారు.

రాష్ట్రంలో అనేక మంది స్వామీజీలు, హిందూ మత పెద్దలు, హిందూ సమాజం కోసం పాటుపడుతున్న సంస్థలు, హిందువులు ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఏకపక్షంగా హిందూ మత పెద్దలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలోని హిందువులను, హిందూ సమాజాన్ని అవమానపరిచినట్లేనని ఆయన అన్నారు. ఒక బాధ్యతగల పార్లమెంట్ సభ్యునిగా, హిందువుగా ప్రజల మనోభావాలను మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news