వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంపై అనుమానాలున్నాయి : సజ్జల

-

2009 సెప్టెబరు 2న హెలికాఫ్టర్‌ దుర్ఘటనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంపైనా మాకు అనుమానాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డిని.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకానందరెడ్డిని టీడీపీ నేతలు అంతమొందించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేశారని ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

హత్య, కుట్రలు, కుతంత్రపు రాజకీయాలతో ప్రత్యర్థులను దెబ్బ తీయడం తన నైజమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి చాటి చెప్పుకున్నారని ఫైర్ అయ్యారు.చార్జిషీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా ? మొదట్నుంచి చంద్రబాబుది కుట్రల స్వభావమని అగ్రహించారు. అందుకే వివేకా కేసులో బాబు నీచమైన ప్రచారం చేస్తున్నారని.. సునీతను పులివెందుల టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబాన్ని చీల్చాలి అని చంద్రబాబు వ్యూహమని చెప్పారు.

సీబీఐ పది అడుగులు చార్జిషీట్‌ వేస్తే బాబు వంద అడుగుల స్టేట్‌మెంట్ అని ఫైర్ అయ్యారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగటమే కాదు జరుగుతోంది అన్న నమ్మకం కూడా కలగాలని… వైఎస్ హయాంలోనూ చంద్రబాబు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news