అభివృద్ధి కోసం సీఎం జగన్ తో ఐనా కలుస్తా – కేశినేని

-

టిడిపి ఎంపి కేసినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం మొండితోక బ్రదర్స్ గురించి చెడుగా విన్నానని.. కానీ నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనతో మాట్లాడుతున్నారని తెలిపారు. మంచి పనులు చేస్తున్నారు కాబట్టే వాళ్ళను ప్రశంసించానని తెలిపారు కేశినేని. మొండితోక బ్రదర్స్ తనకు పార్టనర్స్ కాదని అన్నారు. తనకి టికెట్ వస్తుందా..? రాదా..? అనే భయం లేదని అన్నారు. నియోజకవర్గాలు మా సామ్రాజ్యాలు అంటే పార్టీకే నష్టం జరుగుతుందన్నారు.

గెలిస్తే ఎమ్మెల్యే, లేకపోతే ఇన్చార్జ్ అంటూ నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా భావిస్తే ఎలా..? అని ప్రశ్నించారు కేశినేని. తన పార్టీ పాలసీ తనకి ముఖ్యమని.. దానికోసం వేరే పార్టీతోనైనా ఫైట్ చేస్తానని అన్నారు. అలాగే అభివృద్ధి కోసం అందరితోనూ కలిసి పనిచేస్తానన్నారు. అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్ తో నైనా కలవాల్సి ఉంటుందని అన్నారు కేశినేని. అలా చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగక బెజవాడ నష్టపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news