జగన్‌ ప్రభుత్వాన్ని బొత్స, ధర్మాన కూల్చబోతున్నారు – మాజీ ఎమ్మెల్యే తెనాలి

-

జగన్‌ ప్రభుత్వాన్ని బొత్స, ధర్మాన కూల్చబోతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ సంచలన కామెంట్లు చేశారు. జగనుకు వ్యతిరేకంగా మంత్రులు బొత్స, ధర్మాన జట్టు కడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడి సీఎం పదవి దక్కించుకోండంటూ శ్రావణ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగ హక్కుల్ని కూడా ప్రభుత్వం కాల రాస్తోందని…ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరూ వైసీపీలో ఉండాలని అనుకోవడం లేదని విమర్శలు చేశారు.

జగనుకు వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు బొత్స, ధర్మాన లాంటి నేతలు సిద్ధంగా ఉన్నారని..ధర్మాన, బొత్స సందర్భం వస్తే వైసీపీని వీడి ప్రత్యేకంగా జట్టు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు తెనాలి శ్రావణ్ కుమార్. పెద్దిరెడ్డి తన బృందాన్ని సిద్దం చేసుకుని జగనుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని..ఆత్మగౌరవం.. ఆత్మాభిమానంతో ఉన్న వాళ్లు వైసీపీలో ఇమడలేరన్నారు. సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే నాయకత్వాన్ని వీడండని..పార్టీ మారడం లేదని పదే పదే చెబుతున్నా.. మేకతోటి సుచరిత ఇంకా అభద్రతతోనే ఉన్నారన్నారు తెనాలి శ్రావణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news