ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి నక్సల్స్ నుంచి త్రెట్ ఉన్నా సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు. తనకి నక్సల్స్ నుంచి థ్రెడ్ ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ డీజీపీకి చెప్పిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తీసేస్తారా? అని ప్రశ్నించారు.

ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని.. స్మగ్లర్లు, వారికి సహకరించే వారు ఇక్కడ ఉన్నారని, అలాంటి చోట తిరిగే నాకు రక్షణ ఉండదా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి ప్రాణహాని తలపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తన ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయనకి రెండు ఫోన్లు ఉన్నాయని, గన్ మెన్ కి, పిఏ ఫోన్ లు ఉన్నాయని, తన ఫోన్, పిఏ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా మా ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. టాప్ చేయడం వల్ల వాట్స్ యాప్, ఫేస్ టైమ్ యాప్ లో మాట్లాడాల్సి వస్తుందన్నారు. తన బిడ్డలతో కూడా ఇలానే మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాప్ చేసేదే మా వాళ్ళు, ఇంక నేనెవ్వరికి ఫిర్యాదు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news