షర్మిల చంద్రబాబులా మాట్లాడుతున్నారు : ఎంపీ మిథున్ రెడ్డి

-

షర్మిల చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిందన్నారు. జగనన్న చెల్లెలు గా షర్మిల పై గౌరవం ఉంది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నాడు షర్మిల కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టారు. 16 నెలలు అన్నను జైలులో పెట్టిన పార్టీకి కొమ్ము కాస్తుందన్నారు. చంద్రబాబు లైన్ లోనే షర్మిల మాట్లాడుతుందన్నారు.

మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ లో బీజేపీ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. గత ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నీ జగన్ అన్న నెరవేర్చారు. మేము మీకు మేలు చేసి ఉంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు జగన్ అన్న. ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలు కలిపి ఎన్నికల సన్నాహక సభ ఏలూరులో నిర్వహించబోతున్నామని తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news