ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

-

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు కోటాను టీటీడీ ఈ నెల 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం ఈ నెల 19న ఉదయం 10  నుంచి 21వ తేదీ ఉదయం 10 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22న  పదింటికి విడుదల చేస్తామని పేర్కొంది.

సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్‌ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం మూడింటికి విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న  10గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం పదింటికి టీటీడీ విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news