సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!

-

కష్టాల నుంచి కడతెర్చే తిరుమల శ్రీవారి సన్నిధిలో కూడా కరోనా కేసులు భారీగా రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా టీటీడీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ తరుణంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అది ఏంటీ అంటే… 50ఏళ్ల పైబడిన వారితో పాటు ఆరోగ్య సమస్యలుండే ఉద్యోగులను విధులకు రావొద్దు అని చెప్పింది.

వారిని విధుల నుంచి తప్పించాలని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల్లో భారీగా వారిలో కరోనా కేసులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. దాదాపు తిరుమలలో 200 మంది ఉద్యోగుల వరకు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే భక్తులు ఎవరికి కరోనా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news