సరస్వతి పవర్ పేరుతో రైతుల భూములను దోచుకున్నాడు : సోమిరెడ్డి

-

టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం తల్లి.. చెల్లి అని పదే పదే జగన్
అన్నారు. ఇప్పుడు తల్లీ లేదు.. చెల్లీ లేదు. సరస్వతి పవర్ పేరుతో రైతుల భూములను జగన్ దోచుకున్నాడు. సరస్వతి పవర్ భూములను మూడు భాగాలుగా చేయాలి. రైతులకు ఒక భాగం.. షర్మిలకు ఒక ఇవ్వాలి. మూడో భాగంతో సర్దుకోవాలని జగన్ కు సూచిస్తున్నా.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మొదలైంది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తున్నాం. త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు.. సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి. వై.సి.పి.ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పలు అవినీతి.. అక్రమాలు జరిగాయి. రీ సర్వే పేరుతో తప్పులు తడకగా రికార్డులను రూపొందించారు. వీటిని సరిసిద్ధేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. గోకులం పేరుతో రైతులకు సబ్సిడీ తో పశువులను ఇస్తున్నాం. దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నాం అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version