నిన్న పదవి ఇచ్చారు, ఇవాళ కొడాలి నానీపై టీడీపీ నేత బూతులు…!

-

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కమిటీలో చాలా మంది సైలెంట్ గా ఉండే నేతలకు చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చారు. దీనితో ఒక్కొక్కరు ఇప్పుడు పార్టీ కోసం బయటకు వస్తున్నారు. తాజాగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాధ్ శర్మ తీవ్ర విమర్శలు చేసారు. మంత్రి కొడాలి నాని ఊరకుక్కలా అరవడం మాని హుందాతనం పాటిస్తే ప్రజలు గౌరవిస్తారు అని ఆయన హెచ్చరించారు.

 

చంద్రబాబు, లోకేష్ ల పై నాని చేస్తున్న విమర్శల తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రి నాని నోరు అదుపు లో పెట్టుకొని మాట్లక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆయన హెచ్చరించారు. నాని లాంటి మంత్రుల ప్రవర్ధన వల్ల రాష్ట్రంలో పాలనా వ్యవస్ధ దిగజారిపోతోంది అని ఆయన విమర్శించారు. నాని సిఎం జగన్ మెప్పు కోసం నోరుపారేసుకుంటే మంత్రి పదవి ఊడిపోక తప్పదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news