టిడిపి తన వక్రబుద్ధిని మార్చుకోవాలి – మంత్రి బుగ్గన

-

టిడిపి తన వక్రబుద్ధిని మార్చుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. గవర్నర్ కు సీఎం జగన్ స్వాగతం పలకలేదని టిడిపి తప్పుడు ప్రచారం చేస్తూందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పై టీడీపీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని, టిడిపి తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను బయటపెట్టారు.

టిడిపి ఇకనైనా తన వక్రబుద్ధిని మార్చుకోవాలని, టిడిపి వ్యవహార శైలి సభ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి బుగ్గన. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని స్పీకర్ ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news