బాబులకు చెవిరెడ్డి ఫోటోలు పంపుతున్న తమ్ముళ్లు!

-

మనసంటూ ఉండాలే కానీ.. మార్గాలు అనేకం ఉంటాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తమ అసమర్ధతకు, తమ నిర్లక్ష్యానికి కరోనాను బూచిగా చూపిస్తోన్న చంద్రబాబు – చినబాబులకు తమ్ముళ్లు.. చెవిరెడ్డి ఫోటోలు పంపుతున్నారంట. దానికి కారణం… ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ ను కలవటమే కాదు.. ఇంకా చాలా చేశారు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి!

అవును… కరోనా పేరుచెప్పి సుమారు ఆరునెలలకు పైగా హోం క్వారంటైన్ లో ఉంటున్న చంద్రబాబు – చినబాబులు చాలా జ్ఞానం తెచ్చుకోవాలని.. ప్రజల మనసు గెలవాలంటే రాజకీయాలొక్కటే మార్గం కాదనే విషయం గ్రహించాలని చెబుతున్నారంట. ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ ను కలిసి పలకారించడమే కాకుండా… వారికి వైద్యం ఎలా అందుతుంది? పేషెంట్ల పట్ల సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాలు తెలుసుకోవడంతోపాటు.. రోగులకు ధైర్యం కలిగించేలా మాట్లాడారు!

ఇదే సమయంలో… “మీరంతా త్వరలోనే కోలుకుంటారు” అనే మాటలు చెప్పి వారిలో ధైర్యాన్ని మరింత పెంపెంచుతున్నారు చెవిరెడ్డి. దీంతో… చెవిరెడ్డి కి ఉన్న ధైర్యం తమ అధినేతకు, తమ యువనేతకు ఎందుకు లేకుండాపోయాయని ఫీలవుతున్నారంట తమ్ముళ్లు! కనీసం మాటలు చెప్పే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి… కనీసం ఫోటోలు చూపించి అయినా వారిలో ధైర్యం, ఉత్సాహం, ప్రజలపై ప్రేమ పెంచే పనిలో భాగంగా… చంద్రబాబు – చినబాబులకు చెవిరెడ్డి ఫోటోలు పంపుతున్నారంట తమ్ముళ్లు!!

Read more RELATED
Recommended to you

Latest news