చంద్రబాబు చెప్పుచేతల్లోకి వైఎస్‌ సునీత : వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

-

చంద్రబాబు చెప్పుచేతల్లోకి వైఎస్‌ సునీత వెళ్లారని.. అందుకే జగన్‌ పై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని.. ఈ అంశం వాళ్ళ పార్టీ పునర్ వైభవం వస్తుందని కలలు కంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉండగానే నిందలు వేస్తున్నారని.. వీలైతే జగన్మోహన్ రెడ్డి పై కూడా నింద వేయాలని కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన హత్య ఇదని.. ఆ మూడు నెలల కాలంలో ఏమి తేల్చగలిగారు..? అని మండిపడ్డారు. ఎంతోమంది అధికారులు ఎన్ని విధాలుగా హింసించినా నిందితులు వాస్తవాలు చెప్పలేదని.. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి… ఆదినారాయణ రెడ్డి జిల్లాలో మంత్రి అని గుర్తు చేశారు. వివేకా తన ఆస్తులను రెండో కుటుంబానికి ఇస్తాడనే భయంతో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో స్నేహం చేసాడని.. ఆ లేఖ విషయాన్ని టీడీపీ, పత్రికలు ఎందుకు ప్రస్తావించడం లేదు ??అని ప్రశ్నించారు.

దాన్ని దాచి ఉంచమని చెప్పింది ఎవరు? సీబీఐ ఆ లేఖను మరణ వాంగ్మూలంగా ఎందుకు తీసుకోలేదు..?అని ఆగ్రహించారు. నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తికి వారసుడు కావాలని భావించాడని.. విచారణ పూర్తిగా బయటకు రావాలని ఆ రోజు సీబీఐ విచారణ కోరితే సిట్ వేసింది చంద్రబాబేనని ఆగ్రహించారు. ఎప్పుడైతే సునీత తమ చెప్పుచేతల్లోకి వచ్చారో అప్పటి నుంచి చంద్రబాబు రాజకీయం మొదలెట్టాడని ఆగ్రహించారు. హత్య చేయించింది చంద్రబాబా…? చేసింది నరెడ్డి రాజశేఖర్ రెడ్డా అనే అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news