బ్రేకింగ్ : కాసేపట్లో విశాఖకు రానున్న జగన్…కాపు నేతల సమావేశం

-

బ్రేకింగ్ : మరి కాసేపట్లో విశాఖకు రానున్నారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. మిలాన్ వేడుకలు ఉన్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యానం 2.30 గంటలకు విశాఖ విమానా శ్రయానికి, అక్కడ నుంచి నేవల్‌ డాక్‌ యార్డ్‌ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 3.10 గంటలకు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌక ను తూర్పు తీర నౌకాదళం కి అంకితం చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

జలాంతర్గామి ఐ.ఎన్. ఎస్. వేల సందర్శన చేయనున్నారు. అలాగే 5.30 గంటలకు ఆర్కే బీచ్‌ లో మిలాన్‌ విన్యాసాలను తిలకించనున్న జగన్ మోహన్ రెడ్డి… 6.04 గంటలకు సిటీపరేడ్‌ ప్రారంభించనున్నారు. అలాగే విశాఖ లో కాపు నేతల సమావేశంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననుట్లు సమాచారం అందుతోంది. 2024 ఎన్నికలలో కాపు సామాజిక వర్గ ప్రాభవాన్ని పెంపొందించేవిధంగా చర్చ చేయనున్నారు. ఇక అనంతరం సాయంత్రం 7.15 గంటలకు తిరిగి గన్నవరం బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news