BREAKING : సీఎం జగన్ ను కలిసిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

-

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

ఈ నెల 21 నుంచి విగ్రహ ప్రతిష్ఠ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. జగన్ ను కలిశారు. 26న విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో బాగంగానే ఆహ్వనపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఈ కార్యక్రమం లో టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news