జగన్‌ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది – కేంద్రమంత్రి

-

 

జగన్‌ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహన్. తాజాగా తిరుపతిలో పర్యటించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ పాలనలో జరిగిన అభవృద్ధిపై ప్రజలను చైతన్య పరుస్తున్నామని వెల్లడించారు.

మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తోంని.. జగన్ ప్రభుత్వం.. అవినీతి ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహన్. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని… జగన్ తన అనుచరులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారన్నారు. కేంద్ర పథకాలను పేర్లు మార్చి జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు జగన్ పాల్పడుతున్నారని విమర్శలు చేశారు కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహన్.

Read more RELATED
Recommended to you

Latest news