సీఎం జగన్ పై వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సత్యసాయి జిల్లాలో ఇటీవల విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడిన ఘటనలో ఓ ఆటో దగ్ధం కాగా అందులో ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు.ఓ ఉడుత విద్యుత్ వైర్ల పైకి ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని, హైటెన్షన్ వైర్లు తెగిపోవడానికి ఆ ఉడితే కారణమని విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ముఖ్యమంత్రి గారు.. మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఉడుత ఊపులకు చింతకాయలు రాలుతాయా లేదో కానీ.. హై టెన్షన్ కరెంటు తీగ మాత్రం తెగుతుంది అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు గతంలో జరిగిన పలు సంఘటనలకు ప్రభుత్వం చెప్పిన కారణాలను కూడా వర్లరామయ్య ఈ సందర్భంగా ప్రస్తావించారు. పిల్లి మద్యం తాగదు కానీ.. ఎలుకలు మాత్రం మస్తుగా మందు తాగుతాయని పేర్కొన్నారు. తేనెటీగలు కుడతాయని తెలుసు గాని.. మీ హయాంలో అవి రధాలు కూడా తగలబెడుతున్నాయి.. నిజమా? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news