బాబుతో పొత్తులంటే.. పులి-ఎలుగు బంటిల ద్రోహమే – విజయసాయి

-

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు తో పొత్తులంటే.. పులి-ఎలుగు బంటిల ద్రోహమే అంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు. ఓసారి పులి తరిమితే చెట్టెక్కాడు బాబు. పైన ఎలుగుబంటి కనిపించింది. నీకు గతంలో ద్రోహం చేశాడని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

కాబట్టి కిందకు తోసేయమని భల్లూకాన్ని కోరింది పులి. చంద్రబాబు విశ్వాసఘాతకుడని తెలుసు. అయినా నా ఇంటికొచ్చాడు కాబట్టి హాని చేయను అన్నది ఎలుగు. బాబుతో పొత్తు పెట్టుకుంటే జరిగేదిదే అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

తుక్కుతుక్కుగా ఓడి మూడేళ్లయినా చంద్రబాబుకు బుద్ది రాలేదు. మీరు ఉప్పూ, కారం తినడంలేదా ? అని నిలదీశారు. ఈ ప్రభుత్వంపై మీకెందుకు కోపం రావడం లేదు అంటూ అర్ధరాత్రి ప్రజలపై చిందులేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో బాబునే జనం బాదుతుండటంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు పోతోందని చురకలు అంటిం చారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news