వైసీపీ కార్యకర్తలకు విజయసాయిరెడ్డి కీలక ఆదేశాలు

-

 

వైసీపీ కార్యకర్తలకు విజయసాయిరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గారు చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా, సోషల్ మీడియాలో దురుద్దేశంతో ప్రభుత్వంపై కృత్రిమంగా ప్రజావ్యతిరేకతను సృష్టించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సామాన్య ప్రజానీకం మేలు కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

 

సంక్షేమ పథకాల అమలు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని సాగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదు. జగన్ గారి నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందనిచెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా డాక్టర్లు, క్రిస్టియన్, మైనారిటీ, ప్రచార, చేనేత విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలలో వారికి ఈ మేరకు నేతలకు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news