14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయావ్ – విజయసాయి

-

14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయావని నారా చంద్రబాబు నాయుడిపై సెటైర్లు పేల్చారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తాడట మా చంద్రం అన్నయ్య అంటూ చురకలు అంటించారు.

14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో!కుటుంబపరువు పోతుందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

ఇక మరో ట్వీట్‌ లో రేషన్ పంపిణీలో జగన్ గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ తృతీయస్థానంలో నిలిచింది. రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది. రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వం రేషన్ అందిస్తోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news