మూడున్నర ఏళ్లలో విశాఖకు ఏం చేశారు? – GVL

-

విశాఖ అభివృద్ధి కోసం గత మూడేళ్లుగా వైసిపి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టూరిస్ట్ కేంద్రమైన విశాఖలో టూరిజం పడుకుందని ఎద్దేవా చేశారు. ఋషికొండలో కట్టడాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 45 వేల మంది భూముల్ని 22a జాబితాలో పెట్టి.. మీ ఒక్కరికే ఇల్లు ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

లోన్ యాప్ ల దారుణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. వారికి ప్రజాప్రతినిధుల అండదండ ఉందని విమర్శలు వస్తున్నాయని అన్నారు. లోన్ యాప్ లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిడిపి – వైసీపీ మధ్య భూతుల పోరు నడుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news