వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు: నారా లోకేష్

-

టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మట్టి దొంగలను వదిలేసి.. పోరాడే దూళిపాళ్లను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని అన్నారు. జగన్ రెడ్డి కి ఒక్క చాన్సే చివరి ఛాన్స్ అని తేలిపోవడంతో వైసిపి ప్రజాప్రతినిధులు అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన మట్టి, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతోంది అని అన్నారు. అక్రమార్కులకు అండగా నిలిచిన పోలీసులు.. దోపిడీని ప్రశ్నించిన దూళిపాళ్ల నరేంద్ర ని అరెస్టు చేయడం రాష్ట్రంలో అరాచక పాలన కు అద్దం పడుతుందని చెప్పారు. మట్టి మాఫియా పై పోరాడుతున్న దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా తెలిపారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news